భారత వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలపై అమెరికా ఉపాధ్యక్షుడు, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ స్పందించారు. రష్యా ఆర్ధిక మూలాలను అడ్డుకుని, ఉక్రెయిన్పై దాడులను ఆపేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అంతేకాదు, అలాస్కాలో అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ నెల జరిగిన భేటీపై ప్రతిష్టంభన కొనసాగుతున్నా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తిత్వం కీలక పోత్ర పోషించగలదని వాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్బీసీ ఛానెల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ.. ‘‘రష్యన్లకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని అడ్డుకోడానికి ట్రంప్ భారతదేశంపై సుంకాలు వంటి అస్త్రాన్ని ప్రయోగించారు.. తద్వారా నిధులు ప్రవాహం ఆగి ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగించకుండా ఆపడమే ప్రధాన లక్ష్యం. ట్రంప్, పుతిన్ మధ్య అలాస్కా భేటీ తర్వాత ఆటంకాలు ఏర్పడినప్పటికీ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తిత్వం కీలకం కానుంది... భారత్పై అదనపు టారీఫ్ల ద్వారా చమురు ద్వారా వచ్చే ఆదాయానికి గండికొట్టి రష్యాపై ట్రంప్ బలమైన ఆర్ధిక ఒత్తిడిని తీసుకొచ్చారు.ఉక్రెయిన్లో మారణహోమాన్ని ఆపేస్తే రష్యా మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేర్చవచ్చు.. కానీ యుద్ధాన్ని కొనసాగిస్తే ఒంటరిగా ఉండాల్సిదేననే బలమైన సందేశం ఇవ్వడానికి మా అధ్యక్షుడు ప్రయత్నించారు.. కీవ్పై బాంబు దాడులను నిలిపివేసేలా రష్యా ఒప్పుకునేలా ట్రంప్ ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంభించారు. భారత్పై అధిక సుంకాలను విధించడం ఇందులో భాగమే’’ అని వాన్స్ తెలిపారు.
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్లు విధించిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆశ్చర్యకరంగా రష్యా ముడి చమురు, గ్యాస్ను అత్యధికంగా దిగుమతి చేసుకునే చైనా, ఐరోపా దేశాలపై వాషింగ్టన్ ఇలాంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం. భారత్పై ఆగస్టు 1 విధించిన 25 శాతాలు ఇప్పటికే అమల్లోకి రాగా.. ఆ తర్వాత విధించిన 25 శాతం అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa