ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెండు రోజుల సిట్ కస్టడీ ముగిసింది. రెండో రోజైన శనివారం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. విచారణ ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి అధికారులు విజయవాడకు తరలించి ప్రశ్నించారు. శనివారం దాదాపు నాలుగు గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. స్కామ్కు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.రెండు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజైన శుక్రవారం కూడా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని నాలుగు గంటలకు పైగా విచారించారు. ఆ సమయంలో ఆయనకు 50కి పైగా ప్రశ్నలు సంధించినట్లు వార్తలు వచ్చాయి. రెండు రోజుల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు పలు కీలక వివరాలు రాబట్టినట్లు భావిస్తున్నారు. విచారణ ముగిసిన నేపథ్యంలో, ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, అనంతరం తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa