మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అభివృద్ధిగతవారం ప్రారంభమైన నోబెల్ బహుమతుల ప్రకటన నేటితో ముగిసింది. చివరగా ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాదికి గానూ నోబెల్ బహుమతి గెలుచుకున్న విజేతల పేర్లను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ ఎకనామిక్స్ విభాగంలో మొత్తం ముగ్గురికి నోబెల్ బహుమతులు దక్కాయి. జోయల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్లు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక వీరందరికీ డిసెంబర్ 10వ తేదీన నోబెల్ బహుమతుల ప్రదానం జరగనుంది.
జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్లు.. అర్థశాస్త్రంలో చేసిన విశేష కృషిని గుర్తించి.. ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. 'ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు'.. 'సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు'.. 'సృజనాత్మక విధ్వంసం ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతం కోసం' ఈ ముగ్గురు చేసిన సేవలను గుర్తిస్తూ.. వీరికి నోబెల్ బహుమతి సంయుక్తంగా ప్రదానం చేయాలని రాయల్ స్వీడిష్ అకాడమీ నిర్ణయించింది.
మరోవైపు.. గత శుక్రవారం ప్రకటించిన నోబెల్ శాంతి బహుమతి.. వెనిజులా ఎంపీ మరియా కొరినా మచాడోకు దక్కింది. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం మరియా కొరినా మచాడో చేసిన కృషికి ఈ నోబెల్ బహుమతి ఆమెకు వరించింది. ఇక నోబెల్ శాంతి బహుమతి కోసం గంపెడు ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చుక్కెదురైంది.
విభాగం విజేత పరిశోధన అంశం
వైద్యశాస్త్రం మేరీ ఇ బ్రున్కో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకాగుచీ రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలు
భౌతిక శాస్త్రం జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టినిస్, మైఖేల్ హెచ్ డెవోరెట్ క్వాంటం మెకానిక్స్పై పరిశోధనలు
రసాయన శాస్త్రం సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ యాఘీ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అభివృద్ధి
సాహిత్యం హంగేరియన్ రచయిత లాజ్లో క్రాస్నహోర్కై ప్రపంచ భయాల వేళ కళకు ఉన్న శక్తిని చెప్పేలా చేసిన రచనలు
శాంతి బహుమతి వెనిజులా ఎంపీ మరియా కొరినా మచాడో వెనిజులా ప్రజల హక్కుల కోసం పోరాటం
ఆర్థిక శాస్త్రం జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్ ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధి, సృజనాత్మక విధ్వంసం ద్వారా స్థిరమైన వృద్ధి
స్వీడన్కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్, బిజినెస్మెన్గా ఫేమస్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ బహుమతులు గెలుచుకున్న వారికి పురస్కారాలు అందిస్తారు. ఇక ఆ రోజు జరగనున్న వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు.. 10 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్ల నగదు అందించనున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896లో మరణించగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa