వచ్చే ఏడాది జరగనున్న మహిళల ప్రీమియర్ లీగ్ ( డబ్ల్యూపీఎల్ ) 2026 ఎడిషన్కు ముందు మెగా వేలం జరగనుంది. న్యూఢిల్లీ వేదికగా వచ్చే నెలలో వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని క్రిక్బజ్ నివేదించింది. దాని ప్రకారం, వేలానికి సంబంధించి ఇప్పటికే ఫ్రాంఛైజీలకు నిర్వహకులు సమాచారం అందించారు. వేలం తేదీ ఇంకా ఖరారు కాలేదు. కానీ నవంబర్ 26, 27 తేదీల్లో ఈ వేలం నిర్వహించే అవకాశం ఉంది. గతంలో బీసీసీఐ.. నవంబర్ 26 నుంచి 29 మధ్య వేలం జరుగుతుందని తెలిపింది. తాజాగా తేదీల్లో మార్పులు జరిగాయి.
అయితే ఈ మెగా వేలంలో మొత్తం ఐదు ఫ్రాంఛైజీలు ఎంత మంది ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలి? రైట్ టు మ్యాచ్ కార్డు ఎంతమందికి ఉపయోగించొచ్చు? అనే విషయాలపై బీసీసీఐ ఇదివరకే క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ఒక్కొ ఫ్రాంఛైజీ గరిష్టంగా ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారత ప్లేయర్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. గరిష్టంగా ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకోవచ్చు. ఇక ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్లతో తొలి ప్లేయర్కు రూ.3.5 కోట్లు, రెండో ప్లేయర్కు రూ.2.5 కోట్లు, మూడో ప్లేయర్కు రూ.1.75 కోట్లు, నాలుగో ప్లేయర్కు రూ.కోటి, ఐదో ప్లేయర్కు రూ.50లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
డబ్ల్యూపీఎల్ వేలంలో ఫ్రాంఛైజీల పర్స్ను రూ.15 కోట్లుగా నిర్ణయించారు. ఐదుగురిని రిటైన్ చేసుకుంటే పర్స్ వాల్యూ నుంచి 9.75 కోట్లు కోత పడనుంది. మొత్తంగా ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా 18 మందిని తీసుకోవచ్చు. ఈ లెక్కన మొత్తం ఐదు ఫ్రాంచైజీలు కలిపి 90 మంది ప్లేయర్లను తీసుకోవచ్చు. తమ రిటెన్షన్ జాబితాను ఫ్రాంఛైజీలు.. నవంబర్ 5లోపు బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంది.
రైట్ టు మ్యాచ్ కార్డును బీసీసీఐ అందుబాటులో ఉంచింది. అయితే ఇది రిటెన్షన్ ప్లేయర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఫ్రాంఛైజీ నలుగురిని రిటైన్ చేసుకుంటే.. ఒక ఆర్టీఎమ్ వాడుకోవచ్చు. ఒక్కర్నీ కూడా రిటైన్ చేసుకోకపోతే.. ఐదు ఆర్టీఎమ్లు ఉంటాయి. అంటే ఫ్రాంఛైజీ.. అట్టిపెట్టుకున్న ప్రతి ఆటగాడికి, ఒక ఆర్టీఎమ్ ఎంపికను కోల్పోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa