ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా నుంచి షాకింగ్ ఎక్స్‌క్లూజన్… డబుల్ సెంచరీ తర్వాత కూడా!

sports |  Suryaa Desk  | Published : Mon, Nov 03, 2025, 11:17 PM

టీమిండియా బ్యాటర్ మరియు రాజస్థాన్ స్టార్ ప్లేయర్ దీపక్ హుడా ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చూపుతున్నారు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో జైపూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో హుడా తన డబుల్ సెంచరీతో హిట్టింగ్ ప్రదర్శన కనబరచాడు.మూడో రోజు ఆటను 121 పరుగుల ఓవర్‌ నైట్ స్కోర్‌తో ప్రారంభించిన హుడా, వన్డే శైలిలో అద్భుతమైన బ్యాటింగ్ కొనసాగించాడు. ప్రతిది ఆచితూచి ఆడుతూ, వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు.తన రెండో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీతో హుడా అందరికీ అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. 335 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 248 పరుగులు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 293.హుడా ద్విశతకం ఫలితంగా రాజస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌ను 617/6 వద్ద డిక్లేర్ చేసింది. హుడాతో పాటు కార్తీక్ శర్మ 139, సచిన్ యాదవ్ 92 పరుగులు చేసి జట్టుకు మద్దతు ఇచ్చారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, ములానీ తలా రెండు వికెట్లు సాధించగలిగారు.మూడో రోజు ముగిసే సమయానికి ముంబై వికెట్లు నష్టపోకుండా 89 పరుగులు చేసి క్రీజులో జైశ్వాల్ (56) మరియు ముషీర్ ఖాన్ (32) ఉన్నారు.దీపక్ హుడా విషయానికి వస్తే, భారత జట్టులో అతను చివరిసారి 2023లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీతో మెరిసినప్పటికీ, తరువాత వరుస వైఫల్యాల కారణంగా జట్టులోంచి తీసేయబడాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో కూడా అతను ఆశించిన ఫామ్ కనబరచలేకపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa