అమెరికా, టెక్సాస్లో చదువుకున్న 23 ఏళ్ల రాజ్యలక్ష్మి యర్లగడ్డ (అలియాస్ రాజి) నవంబర్ 7, 2025 ఉదయం ఆకస్మికంగా మృతి చెందింది. ఆమె ఇటీవలే టెక్సాస్ A&M యూనివర్సిటీ, కార్పస్ క్రిస్టీ నుండి విద్యాస్నాతక పట్టా పొందింది.తన కుటుంబానికి భవిష్యత్తులో మద్దతుగా ఉండాలని కలలుకన్న రాజ్యలక్ష్మి, ఆ కల నెరవేరక ముందే అనారోగ్యంతో అసమయంలో తనువు వదిలింది. బాపట్ల జిల్లా, కారంచేడు గ్రామానికి చెందిన రాజి, అమెరికాలో ఉన్నత చదువులను ఇటీవలే పూర్తి చేసింది. మృతి కంటే రెండు–మూడు రోజులుగా ఆమె తీవ్ర దగ్గు, ఛాతి నొప్పితో బాధపడుతూ వచ్చింది.నవంబర్ 7 ఉదయం అలారం మోగినా లేచలేకపోవడంతో, తోటి స్నేహితులు గమనించి వెంటనే సహాయం అందించకముందే ఆమె మృతి చెందింది. దీని కారణంగా రాజి కుటుంబం, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.రాజి కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామంలో వ్యవసాయం ఆధారంగా జీవిస్తోంది. వారి భూమి, పశువులు కుటుంబానికి ఆర్థిక ఆదారంగా ఉన్నాయి. అయితే, రాజి చదువుతోనే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్న తపనతో అమెరికాకు వెళ్లింది.ఆకాంక్షలు నెరవేరకముందే ఆమె మృతి చెందడంతో, కారంచేడు గ్రామంలో విషాద వాతావరణం అలమలైంది. భారతీయ ఎంబస్సీ అధికారులు ప్రస్తుతం రాజి మృతదేహాన్ని స్వగ్రామం కారంచేడుకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో ఆమె మృతదేహం భారత్కు చేరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa