ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ చేపట్టిన పోలవరం నిర్మాణం ఇక ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఈ మేరకు మరో రెండేళ్ల పాటు ప్రాజెక్ట్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు.. స్టాప్వర్క్ ఆర్డర్ను రెండేళ్ల పాటు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు తెలిపారు. ఆయన బుధవారం ఢిల్లీలో తనని కలసిన మీడియాతో మాట్లాడుతూ, . పోలవరం ప్రాజెక్టు నిర్మాణ భారంతో పాటు సవరించిన అంచనాలను ఇప్పటికే ఆమోదించామని, ఇందుకు సంబంధించిన ఖర్చు యావత్తు సైతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేదిశగా స్టాప్వర్క్ ఆర్డర్ను పూర్తిగా రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలుండటంతో రెండేళ్ల పాటు నిలపివేత నిర్ణయం తీసుకున్నామని, ఈ లోగా ఆంధ్ర ప్రజలకు సాగు, త్రాగు నీరు విషయంలో అక్కడి ప్రభుత్వాలు జాగురకతతో వ్యవహరిస్తే, ప్రాజక్టు నిర్మాణం శరవేగంతో పూర్తవుతుందని అన్నారు. కేంద్రానికే పోలవరం పనులు అప్పగించాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నా, వైఎస్ లక్ష్యంగా పోలవరాన్ని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని చూస్తోంది. తాజా కేంద్ర నిర్ణయంతో మరో రెండేళ్లు సమయంలో నిర్వఘ్నంగా పనులు సాగిస్తే... పోలవరం పూర్తి చేసే అవకాశం దొరికినట్టయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa