దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూలులో సామాజిక వేత్త, 'పార్డ్ ఇండియా, సోషల్ క్యాంపెయినర్ సుంకవల్లి సత్తిరాజు విద్యార్దులకు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి విశ్లేషణాత్మకంగా వివరించారు. ధరిత్రీ పరిరక్షణకు సత్వరమే చర్యలు చేపట్టాలని.. గాలిలో అధిక శాతంలో చేరుతున్న గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో అవాంఛనీయ మార్పులకు కారణమవుతున్నాయని వాతావరణ మార్పులకు కార్బన ఉద్గారాలు కారణమని వివరించారు. మైక్రోఫైబర్లు, మైక్రోబీడ్స్ వంటి అతి సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల సముద్ర జీవాలు నశించి పోతున్నాయి. కాలుష్య కారకాలవలన ఆక్సిజన్ శాతం తగ్గిపోయి.. శ్వాసకోశ వ్యాధులు, ఇతర అనారోగ్య పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఆస్ట్రేలియా దేశంలోని వియన్నా, మెల్బోర్న్, సిడ్నీ నగరాలు, జపాన్ లోని ఒసాకా, కెనడా లోని కాల్గరి వంటి నగరాలు అత్యంత నివాసయోగ్య ప్రాంతాలుగా ఉంటే, మనదేశంలోని ఢీల్లీ, పాట్నా, గ్వాలియర్, అమృత్ సర్, రాయపూర్ వంటి నగరాలు అత్యంత కాలుష్యపీడిత నగరాలుగా మారడం మానవ తప్పిదమేనని.. తక్షణమే పర్యావరణ పరిరక్షణకు సత్వర చర్యలు తీసుకోవాలని సుంకవల్లి సత్తిరాజు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకమే ఏకైక మార్గమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్డ్ ఇండియా కోఆర్డినేటర్ సోమిశెట్టి వెంకట్రావు, ప్రధానోపాధ్యాయులు యు చంద్రరావు, ఉపాధ్యాయులు బెల్లపు శ్రీనివాస్, పి తిరుపతిరావు, ఇతర వక్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa