టీడీపీ పార్టీ నేతలతో గురువారం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే…“ఏ ప్రభుత్వమూ అతి తక్కువ కాలంలో ఇంత అప్రతిష్ట పాలు కాలేదు. కావాలని మనపై బురద చల్లాలని చూసి ఆ బురద జగనే పూసుకుంటున్నాడు. పీపీఏ ల పై హైకోర్టు తీర్పు, కేంద్రమంత్రి లేఖలే దీనికి ఉదాహరణలు. పోలవరం ద్వారా దోపిడీకి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టులో రూ. 750కోట్లు తగ్గించామని చెప్పుకుని 7500కోట్లు నష్టం చేకూర్చారు. ఎలక్ట్రిక్ బస్సుల క్విడ్ ప్రోకో లో భాగంగానే పోలవరంకి గతంలో ఎక్కువ కోట్ చేసిన సంస్థ ఇప్పుడు తక్కువ కోట్ చేసింది. మెగా కు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చే దానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్ర బాబు అడ్డుపడితే ఆయన్ని తప్పించారు.
ప్రజల్ని మభ్యపెట్టి దోచుకోవటానికి శ్రీకారం చుడుతున్నారు. వరద తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటం లేదు. ప్రైవేటు సంస్థ ముందుకొచ్చి తీస్తామన్నా వారికి అనుమతివ్వటం లేదు. ఇసుక పరిస్థితి దారుణంగా ఉంది. ఇసుక కొరత వల్ల 20లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదలమయం చేస్తున్నారు. అన్నింటిపైనా గట్టిగా పోరాడుదాం. మీరెవ్వరు భయపడవద్దు. త్వరలోనే భవిష్యత్ కార్యచరణ ప్రకటించి పథకం ప్రకారం ముందుకు పోదాం. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. ప్రజల హక్కులను కాలరాస్తున్నప్పుడు ఖచ్చితంగా తిప్పికొట్టాలి. అందుకు సమయం ఆసన్నమైంది. అంతా సిద్దంగా ఉండాలి.” అంటూ చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa