ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శారదాపీఠంలో శరన్నరాత్రి మహోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2019, 06:34 PM

శారదాపీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర ఆధ్వర్యంలో రాజశ్యామల శరన్నరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, పుణ్యహవచనం, గోపూజ, రక్షాబంధన్‌లతో వేద పండితులు పీఠం అధిష్ఠాన దేవత రాజశ్యామల శారదామాత అమ్మవారికి నవరాత్రి కలశ స్థాపన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. పీఠం స్వర్ణ మండపంలో రాజశ్యామల శారదామాతకు పీఠాధిపతి పంచామృతాభిషేకాలు నిర్వహించి, ఏకాదశ హారతులు ఇచ్చారు. రాజశ్యామల అమ్మవారు బాలాత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa