మహాత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతుంటే కశ్మీర్ లో కేంద్రం కర్ఫ్యూ విధించడంపై మండిపడ్డారు. జాతిపిత మహాత్మగాంధీజి ఏం చెప్పారో నెహ్రూ అదే చేశారని స్పష్టం చేశారు.అసలు కశ్మీర్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నారని గుర్తు చేశారు. పాకిస్తాన్ కూడా భారత్ దేనని చెప్పుకొచ్చారు. గాంధీని, నెహ్రూను, కాంగ్రెస్ పార్టీని అంబేడ్కర్ ఏనాడు సమర్థించ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ వాస్తవాలను మాత్రమే చెప్పారని ఉండవల్లి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa