రాజకీయాలకు రాజధాని సింహపురి రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు కనుమరుగవుతున్నారు. కొత్త నేతలు తెరపైకొస్తున్నారు. ఊహించని పరిణామాలు రోజుకొక్కటిగా పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేకించి నెల్లూరు రూరల్లో రాజకీయ సమీకరణాలు ఉత్కంఠగా మారుతున్నాయి. గత నెల రోజులుగా నెల్లూరు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజుకొక్కరుగా ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీలోకి వలసబాట పడుతున్నారు. కరుడుగట్టిన టీడీపీ నేతలుగా ఆ పార్టీ ప్రధాన నాయకులకు అనుచరులుగా ఉన్నవారు సైతం గుడ్బై చెప్పేస్తున్నారు. రూరల్లో మాజీ మంత్ర సోమిరెడ్డి అనుచురులు చాలా మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా మాజీ మంత్రి నారాయణ ఆంతరంగికుడిగా పేరున్న లిటిల్ ఏంజల్స్ అధినేత, సీనియర్ పొలిటిషియన్ చాట్ల నరసింహారావు టీడీపీకి హ్యాండిచ్చేశారు.రేపోమాపో ఆయన వైసీపీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. ఇన్నాళ్లు రూరల్లో తమదే బలమని చెప్పే టీడీపీ ఇప్పుడు ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్ వ్యూహంతో ఆ పార్టీ విలవిల్లాడే పరిస్థితికి వచ్చింది. ఆరంభంలోనే దూకుడుగా అనుచర వర్గాన్ని పెంచుకుంటున్న కోటంరెడ్డి గిరిధర్ రోజుకో వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటున్నారు. దీంతో నగరంతో పాటు రూరల్లో టీడీపీకి ద్వితీయశ్రేణి క్రమేపి దూరమవుతోందన్నది వాస్తవంగా కనిపిస్తోంది. టిడిపి సహా, వామపక్ష నాయకులను సైతం అధికార పక్షంలో చేర్చుకోవడంతో సింహపురి రాజకీయాలు రసకందాయంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa