నెల్లూరు జిల్లా ఏ.ఎస్. పేట మండలం రాజవోలు గ్రామం వెళ్లే మార్గంలో ఉన్నఅటవీ ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగినట్టు స్థానికులు చెపుతున్నారు. బుధవారం ఉదయం ఈ అటవీ ప్రాంతంలో మేకలు మేపు కోడానికి వెళ్లిన మేకల కాపరులు . సంఘటనా స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గులు వేసి వాటి మధ్యలో కుంకుమ కర్పూరంతో పూజలు చేసే టెంకాయలు కొట్టి వాటికి బొట్లు పెట్టి , చుట్టూ నిమ్మకాయలు పిండి అగరవత్తులు వెలిగించారు. నాలుగు వైపులా కోళ్ళను కోసి పడవేసిన దృశ్యాన్ని చూసారు. దీంతో భయపడి పోయి గ్రామంలోకి వెళ్లి చెప్పడంతో గ్రామస్తులలో కొందరు వెళ్లి ఈ ప్రాంతాన్ని చూసి వచ్చేశారు ఈ స్థలంలో చేతబడులు గానీ క్షుద్ర పూజలు చేసినట్టుగా తాము భావిస్తున్నామని కొందరు చెప్పగా, అక్కడ వాతావరణం భయంకరంగా ఉండడంతో అటుగా వెళ్లడానికి గ్రామస్తులు భయపడుతున్నారని .. సంఘటన స్థలంలో నాలుగు వైపుల కోళ్లను కోసి ఉండడంతో ఒక పూలదండ కూడా అక్కడ పడి ఉండడంతో ఎవరినైనా నరబలి ఇచ్చి ఉంటారని భావిస్తున్నామని మరికొందరు అన్నారు.. భయాందోళనలో ఉన్న రాజవోలు, పోనుగోడు గ్రామస్తులు పోలీసులు తక్షణజమే విచారణ చేపట్టి వాస్తవాలను బైటకు తీసుకురావాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa