ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోరు బావిలో పడిన బాలుడు సుజిత్‌ మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 11:13 AM

చెన్నై: తమిళనాడులో బోరు బావిలో పడిన బాలుడు సుజిత్‌ (2) మృతి చెందాడు. బాలుడి మృతిని అధికారులు ధృవీకరించారు.  తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టిలోని బోరుబావిలో శుక్రవారం సాయంత్రం సుజిత్‌ పడిన విషయం తెలిసిందే. సుమారు 600 అడుగుల లోతైన బోరు బావిలో 100 అడుగుల దగ్గర బాలుడు చిక్కుకున్నాడు.సుజిత్‌ ను బయటకు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలకు ఫలించలేదు. బోరు బావి నుంచి వెలికితీసిన సుజిత్‌ మృతదేహాన్ని మనప్పరాయ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa