హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. సీఎం జగన్ ముందు కొత్త ప్రతిపాదన పెట్టారు. జగన్ అవకాశమిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి పోలీసుగా మారుతానని అభ్యర్థించారు. పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎంపీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అహర్నిశలు ప్రజల కోసం పని చేస్తున్నారని, అంతే కాకుండా ఇప్పటికీ దివాకర్రెడ్డికి రక్షణ కల్పిస్తున్నది పోలీసులనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా పోలీసు బూటును ముద్దాడి, శుభ్రం చేశారు. పోలీసులు బూట్లు అంటే యుద్ధంలో ఆయుధాలు అని మాధవ్ కొనియాడారు.
గోరంట్ల మాధవ్ ఇంకా ఏమన్నారంటే...
రాత్రనక, పగలక ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే పోలీసులపై జేసీ నోటికొచ్చినట్లు మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. తాను పోలీసు అధికారిగా ఉండగా పోలీసులపై దివాకర్రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు స్పందించి తాను మీసం తిప్పితే... ప్రజలు తనను పార్లమెంట్కు, జేసీని బజారుకు పంపించారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
చంద్రబాబు నవ్వడమేంటి?
పోలీసులపై జేసీ దివాకర్రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే పక్కనే ఉన్న చంద్రబాబు మందలించకపోడాన్ని ఎంపీ మాధవ్ తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థను కించేపరిచేలా మాట్లాడిన జేసీని ఎందుకు వారించలేదని నిలదీశారు. పైగా జేసీ మాటలు విని చంద్రబాబు నవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు విని ఎలా నవ్వగలిగారని ప్రశ్నించారు. ఇటీవల కియో కంపెనీకి వెళ్లినప్పడు తనతో పాటు వచ్చిన అతిథిని కారులో కూర్చోబెట్టుకోవడం మరిచిపోవడంతో తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మందలించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa