ఏపీలో జనవరి 9, 10 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పంచాయతీల ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. జనవరి 10 తర్వాత స్థానిక నిర్వహణకు వీలుగా ఏర్పాటు కొనసాగుతున్నాయి. అలాగే జిల్లాల వారీగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సామగ్రి కొనుగోలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ తర్వలో ఖరారయ్యే ఛాన్స్ ఉంది.
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13,065 గ్రామ పంచాయతీల పరిధిలో 1.30 లక్షల వార్డు సభ్యుల పదవులకు మూడు, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఒకటి లేదా రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. త్వరగా ఎన్నికల ప్రక్రియ ముగిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముందుగా నిర్వహిస్తే బాగుంటుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఎన్నికలు ముగియగానే పది పదిహేను రోజుల వ్యవధిలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభించాలని అధికారులు వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa