ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధానికి భూములిచ్చిన రైతులు భయపడాల్సిన పని లేదు: వైసిపి నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2019, 05:14 PM

రాజధానికి భూములిచ్చిన రైతులు భయపడాల్సిన పని లేదని, వారికి న్యాయం జరగుతుందని  వైసీపీ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు ఆందోళన చెందడం సహజమే కానీ, దాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న చంద్రబాబు, రైతులతో సీఎం జగన్ ని, వైసీపీని  తిట్టిండమేంటంటూ మండిపడ్డారు. సమాజంలో గందరగోళ పరిస్థితులు సృష్టించాలని చూడటం సబబు కాదని సూచించారు. రాజధాని కోసం తీసుకున్న భూములను చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్లకు తక్కువ ధరకు ఇచ్చుకున్నారని ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa