ఓవైపు రాజధాని రగడ రగులుతుంటే, ఏపీలో సీఎం జగన్ 25 జిల్లాల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తనదైన తీరుగా సెటైర్ వేశారు. ఆదివారం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రాజధాని విషయమై పలు ట్వీట్లు చేసారు.
జగన్ గారూ.. మీరు కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలంటే కొత్తగా ఏర్పడే 25 జిల్లాలలో జిల్లాకి ఒక్కటి చొప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుం దేమో ఆలోచించండి’’ అంటూ ట్వీట్ చేశారు. కేశినేని నాని చేసిన ఈట్వీట్లు సామాజిక మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రతి జిల్లా కేంద్రాన్ని ఓ రాజధానిగా ప్రకటించేసి, ఆయా జిల్లాల ప్రాధాన్యతలను బట్టి సచివాలయ విభాగాలను విడి విడిగా ఏర్పాటు చేస్తే మంచిదేనని, జగన్ కోరుకునే పాలనా వికేంద్రీకరణ మరింతగా జనం ముందుకు చేరువవుతుందని సెటైర్లేస్తున్నారు కొందరు.
ఇక అమరావతిలో రాజధాని రైతులపై పోలీసులు లాఠీలు ఝులిపించడం, టీయర్ గ్యాస్ వదలటంపై విపక్షాలు మండి పడుతున్నాయి. మండుటెండలో మందడాం జంక్షన్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న రైతులపై పోలీసులు తమదైన తీరుగా బాదేసారు. దీంతో రైతులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ దశలో సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు రైతులు సిద్దపడ్డారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య పెద్ద రగడే జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa