ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబయిపై విరుచుకుపడుతున్న 'నిసర్గ'

national |  Suryaa Desk  | Published : Wed, Jun 03, 2020, 08:59 AM

సుమారు శతాబ్దం అనంతరం ముంబయి నగరంపై నిసర్గ తుఫాను విరుచుకుపడుతోంది. తుఫాను తీరం దాటక ముందే వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది. ముంబయి తీర ప్రాంతాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రపు అలలు సుమారు 6 అడుగుల ఎత్తుతో ఎగసి పడుతున్నాయి. నిసర్గ తుఫాను మహారాష్ట్ర, గుజరాత్‌ తీరాలవైపు దూసుకువస్తోందని, బుధవారం మధ్యాహ్నం ముంబయికి 100 కిలోమీటర్ల దూరంలో గల అలీబాగ్‌ సమీపంలో తీరాన్ని తాక‌నుంద‌ని వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. కాగా, ముంబయి తీర ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అలాగే ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మరింత వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభించారు. ఇప్పటికే 41వేల కరోనా కేసులతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్న సమయంలో ఈ తుఫాను వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. 'నిసర్గ' ప్రభావం అధికంగా ఉండే అవకాశాలున్నాయని, మరో రెండు రోజుల పాటు ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే తెలిపారు. లాక్‌ డౌన్‌ కారణంగా పున్ణప్రారంభమైన చిన్న మధ్య తరహా పరిశ్రమలు, మరో మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు. ప్రధాని మోడీ మహారాష్ట్ర, గుజరాత్‌ ముఖ్యమంత్రులతో పాటు డామన్‌, డయ్యు, దాద్రా, నగర్‌ హవేలీ అధికారులతో తుఫాను ప్రభావంపై చర్చించారు. ఈ ప్రాంతాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa