ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకుకు వెళ్లిన మహిళ శవమైంది

national |  Suryaa Desk  | Published : Wed, Jun 17, 2020, 02:45 PM

బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళ అనుకోకుండా అద్దాల తలుపుకు తగిలి మరణించింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కేరళ ఎర్నాకుళంలోని పెరుంబవూర్ కు చెందిన బీనాకు 46 సంవత్సరాలు. సోమవారం ఆమె బ్యాంకు పని మీద బ్యాంకు ఆఫ్ బరోడాకు వెళ్లింది. అక్కడ పని ముగిసిన అనంతరం బయటికి వచ్చింది. బండి కీ బ్యాంకులోనే మర్చిపోవడంతో తిరిగి బ్యాంకుకు వచ్చి ఒక్కసారిగా బయటికి ఊరికింది. దీంతో బ్యాంకు గేటు అద్దాలు తగిలి ఆమె కిందపడిపోయింది. ఆ అద్దంలో నుంచి పెద్ద ముక్క ఆమె కడుపులో గుచ్చుకుంది. బ్యాంకు సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎర్నాకుళం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa