ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ క్రీడా పుర‌స్కారాలు ప్ర‌దానం చేసిన రాష్ర్ట‌ప‌తి

national |  Suryaa Desk  | Published : Sat, Aug 29, 2020, 01:46 PM

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పలు రంగాల్లో రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. ప్రతి ఏటా ఢిల్లీలోని సాయ్‌ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా ఈ ఏడాది తొలిసారి వర్చువల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తదితరులు హాజరయ్యారు. ఈ సంవత్సరం ఖేల్‌ రత్న అవార్డు గ్రహీతల పేర్లను మొదట పిలిచారు, తరువాత ద్రోణాచార్య అవార్డు గ్రహీతలను ఆహ్వానించారు..ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, చండీగఢ్‌, కోల్‌కతా, సోనపట్‌ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది మొత్తం 74 మందికి అవార్డులు ప్రకటించగా.. వారిలో ఐదుగురికి రాజీవ్‌ ఖేల్‌ రత్న.. 27 మందికి అర్జున అవార్డులు అందజేశారు. అవార్డు దక్కిన వారిలో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, స్టార్‌ ఇండియన్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మలు హాజ‌రు కాలేదు. . కరోనా పాజిటివ్‌ రావడంతో వినేశ్‌‌ ఫోగట్‌ హాజరు కాలేదు. ఇక రోహిత్‌ శర్మ యూఏఈలోని ఐపీఎల్‌ కోసం సన్నద్దమవతున్నందున ఈ వేడుకకు దూరమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa