ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16న ఎన్డీయే పక్షాల భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 09, 2017, 12:39 PM

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మిత్రపక్షాలు ఈ నెల 16న సమావేశం కానున్నాయి. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశం ఉంది. 17 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, అదే రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ఇప్పటికే సజావుగా పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సహకరించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ 16న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 17న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నాడే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. అధికార ఎన్డీయే తరఫున రామ్‌నాథ్ కోవింద్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మీరాకుమార్ రాష్ట్రపతి రేస్‌ లో నిలిచారు. ఈ నేపథ్యంలో 16వ తేదీనే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ.. ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్‌లో ఎన్డీయే మిత్రపక్ష పార్టీల నాయకులతోనూ ప్రధాని మోదీ భేటీ అవుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa