ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూర్ఖాలాండ్‌లో సద్ధుమణగని పరిస్థితులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2017, 10:05 AM

గూర్ఖాలాండ్ ఉద్యమం తీవ్ర రూపు దాల్చుతోంది. గత 48 గంటల్లో ముగ్గురు ఆందోళనకారులు మృతి చెందడంతో గూర్ఖా జనముక్తి మోర్చా కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. కనిపించిన చోటల్లా దాడులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసి తగలబెడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు జరుపుతున్న కాల్పుల్లో నిరసనకారులు ముగ్గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రతిచర్యగా డార్జిలింగ్ పరిసరాల్లో జనం రెచ్చిపోతున్నారు. దేనికైనా రెడీ అంటూ సవాల్ విసురుతున్నారు. అటు పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మోహరించినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. గూర్ఖా జనముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటుతుండడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే శాంతి ప్రతిపాదనను గూర్ఖా జనముక్తి మోర్చా తిరస్కరించింది. రాష్ట్రం ప్రకటించే వరకూ ఉద్యమం ఆగదంటూ హెచ్చరికలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa