ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్మగడ్డ‌పై ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్‌..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 08, 2021, 05:27 PM

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై తాడికొండ నియోకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ నిప్పులు చెరిగారు. సోమవారం గుంటూరులోని తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీదేవి, మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయాలనడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ పని చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రిపై ఎన్నికల కమిషనర్ ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తికి నియంత్రణ ఉండాలని అలా కాకుండా ఏకపక్ష ధోరణితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రి పెద్దిరెడ్డిని నిలువరించాలనుకోవడం అప్రజాస్వామకమన్నారు. నిమ్మగడ్డ రమేష్ తన పరిధిని దాటి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డిని నిలువరించాలనుకోవడం అప్రజాస్వామికం, దురదృష్టకరమని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa