విజయనగరం కోవిడ్ ఆసుపత్రి ఘటనపై డిప్యూటీ సిఎం పుష్ప శ్రీ వాణి మాట్లాడుతూ... కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్, డిసిహెచ్ఎస్, సూపరింటెండెంట్ తో మాట్లాడానన్నారు. వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని దఅష్టికి ఈ సమస్యను తీసుకెళ్లానని చెప్పారు. ఐసియు లో ఉన్న రోగులకు సరఫరా అయ్యే ఆక్సిజన్ పంపిణీలో ఇబ్బంది ఉందని తెలిపారు. 15 మంది రోగులను తక్షణమే వేరొక ఆసుపత్రి కి తరలిస్తున్నామన్నారు. ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవ్వరు మరణించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తిరుమల ఆస్పత్రికి ఈ రోగులను తక్షణమే తరలిస్తున్నామన్నారు. పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంటే విశాఖ కు తరలించాలని ఆళ్ల నాని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు సాయంత్రానికి ఆక్సిజన్ సరఫరా సాంకేతిక సమస్య ను కూడా పరిష్కరిస్తామన్నారు. విజయనగరం జిల్లాలో అన్ని ఆస్పత్రులలోను ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa