ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడప జిల్లాలో దారుణం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 26, 2021, 11:30 AM

 ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లితోపాటు తోబుట్టువులను హత్యచేశాడో కిరాతకుడు. జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన కరీముల్లా అనే వ్యక్తి తల్లి, చెల్లి, తమ్ముడిని కిరాతకంగా చంపేశాడు. అనంతరం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కుటుంబ కలహాలతోనే వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa