పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరు నుంచి మొత్తం 20 రోజుల పాటు నడవనుంది. ఈ సారి కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహించనున్నారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరగబోతున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకూ ఉభయ సభలు నడవబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాలపై మంత్రివర్గ సంఘం - CCPA ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఈ సారి కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగానే పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. MPలతో పాటు పార్లమెంటు భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించే వాళ్లంతా తప్పనిసరిగా మాస్క్లు ధరించాల్సి ఉంటుంది. శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. గత ఏడాది కరోనా భయాల వల్ల పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగలేదు. తర్వాత జరిగిన బడ్జెట్, వర్షాకాల సమావేశాలను కుదించారు. అంతేకాదు... ఉదయం రాజ్యసభ జరిగితే... మధ్యాహ్నాం లోక్సభ నిర్వహించారు. అయితే, ఈ సారి పార్లమెంట్ ఉభయ సభలు పాత పద్ధతిలో ఏకకాలంలో నడవనున్నాయి. ఇక పార్లమెంట్ సభ్యులతో పాటు ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మందికి ఇప్పటికే రెండు డోసుల కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa