ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులకు 'టీటీడీ' సూచన.. ఆ నాలుగు రోజులు వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 09, 2021, 10:17 PM

తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ కీలక  సూచన చేసింది దయచేసి జనవరి 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేస్తున్నట్లు గమనించాలని తెలిపింది.  నాలుగు రోజుల పాటు సిఫారసులపై గదుల కేటాయింపు ఉండదని టీటీడీ ప్రకటించింది. జనవరి 13న వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి వేడుకలు జరుగుతాయని. ఆయా తేదీలలో తిరుమల వచ్చే భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.మరోవైపు జనవరి 11 నుంచి 14 వరకు తిరుమల వచ్చే ప్రముఖులకు వెంకట కళానిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవింద సాయి విశ్రాంతి గృహాల్లో అలాట్‌మెంట్ కౌంటర్లు ఏర్పాటు చేసి గదులు కేటాయిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీఐపీలకు గరిష్టంగా రెండు గదులు మాత్రమే కేటాయిస్తామని వారు స్పష్టం చేశారు. ఆయా రోజుల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు అన్ని గదులను కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే బుక్ చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa