మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు 15రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లక్ష్మీనారాయణ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈనెల 10న సీఐడీ ఆయన ఇంట్లో తనిఖీలు జరిపింది. ఆ సమయంలో ఆయన స్పృహ తప్పిపడిపోయారు. కాగా సోమవారం విచారణకు రావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేశారు. సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి 241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa