ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అమరజీవి' పొట్టి శ్రీరాములు పట్టుదలకు మారుపేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 01:36 PM

తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని .. తన త్యాగాల ఫలితంగా తెలుగు రాష్ట్రం సాధించిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌనులో గురవయ్య, మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మిం చారు. విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. ఆ తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్‌ చదివారు. ‘గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులర్‌ రైల్వే’లో చేరి ఉద్యోగం చేసాడు. భార్య, కుమారుడు చనిపోవడంతో జీవిత సుఖాలపై విరక్తి కలిగింది. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసారు.


గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన అనుయాయిగా ఉన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్షను అనుభవిం చారు. తర్వాత మళ్ళీ 1941–42 సంవత్సరాల్లో క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడంవల్ల మూడుసార్లు జైలుకు వెళ్ళారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు. జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసారు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసేవారు.


ఆయన ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. 1952 అక్టోబర్‌ 10 నుంచి 58 రోజులపాటు చెన్నైలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిసెంబర్‌ 15న పొట్టి శ్రీరాములు అఖిల ఆంధ్రుల హృదయాలలో అమర జీవిగా నిలచిపోయారు. ఆ విధంగా ఆ అమర జ్యోతి ఆగిపోయినా వారందించిన పోరాట స్ఫూర్తితో తెలుగు జాతి యావత్ ప్రపంచానికి వెలుగులు పంచుతూ ముందుకు సాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa