వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారంనాడు విజయవాడలో ప్రజా ఆగ్రహ సభ జరగనున్నది. వైసీపీ ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేస్తూ ఈ సభను బీజేపీ నిర్వహిస్తోంది. సభా ఏర్పాట్లును సోమవారంనాడు మాజీ మంత్రులు, సీనియర్ బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, ఆదినారాయణ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం ,ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిట్ర శివన్నారాయణ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్,బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా ఇంచార్జి వల్లూరి జయప్రకాష్,భాను ప్రకాష్ రెడ్డి, డాక్టర్ దాసం ఉమామహేశ్వర రాజు, బబ్బూరి శ్రీరాం, అడ్డూరి శ్రీ రాం, అడపా నాగేంద్ర తదితరులు పరిశీలించారు. ఇదిలావుంటే రేపటి ప్రజాగ్రహ సభ ఏర్పాట్లును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు టెలికాన్ఫెరెన్స్ ద్వారా మండల ఆ పైస్థాయి నాయకులతో మాట్లాడారు. టెలికాన్ఫెరెన్స్ ను బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు నిర్వహించారు . ఈ సందర్భంగా క్షేత్ర స్ధాయిలో బిజెపి నేతలు విజయవాడ ప్రజాగ్రహ సభ వేదిక వద్దకు ఏవిధంగా చేరుకోవాలన్న అంశాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి విజయవాడ వస్తున్న సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సోమువీర్రాజు వివరించారు.2024 నాటి ఎన్నికలకు ఎలా అడుగులు వేయాలో నాంది పలికేవిధంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు సోమువీర్రాజు టెలికాన్ఫెరెన్స్ లో వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa