ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 09:30 AM

విజయనగరం: ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని శృంగవరపుకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ సంతోషి కుమారి అన్నారు. శృంగవరపుకోట పంచాయతీ పరిధిలో గల సాయినాథ్ కాలనీలో గురువారం ఉదయం ఆమె మంచి నీటి కొళాయిని ఉప సర్పంచ్ మోపాడ కుమార్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పంచాయతీలో ప్రజలు త్రాగునీటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు పంచాయతీ పరిధిలో కుళాయిలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయితీఅభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాకాడ రమణ, కడారి జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa