ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్లెల్లో వెలుగుల కోసం... గ్రామ్ ఉజాల

national |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 08:53 PM

నేటికి విద్యుత్ అందని పల్లెలు మన దేశంలో అనేకమున్నాయి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో వెలుగులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామ్ ఉజాలాను ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కింద కేవలం రూ.10కే ఎల్ఈడీ బల్బులను అందజేస్తోంది. ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా ఎల్ఈడీ బల్బులను ప్రభుత్వం పంపిణీ చేసినట్టు ప్రకటించింది. గ్రామ్ ఉజాలా యోజన కింద 50 లక్షల ఎల్ఈడీ బల్బుల పంపిణీ మైలురాయిని చేరుకున్నట్టు ప్రభుత్వ కంపెనీ కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) తెలిపింది. ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సబ్సిడరీ సీఈఎస్ఎల్ ఈ మార్కును సాధించినట్టు పవర్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బిహార్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం గ్రామ్ ఉజాలా యోజనను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.కేవలం రూ.10కే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసేందుకు సీఈఎస్ఎల్ ఈ పథకాన్ని మార్చిలో ప్రకటించింది. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే 2021 సందర్భంగా కేవలం ఒక్క రోజులోనే 10 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసిన ఘనతను సాధించింది. సంప్రదాయ బల్బులకు బదులుగా ఒక్కో ఎల్ఈడీ బల్బును రూ.10కే మూడేళ్ల గ్యారెంటీతో 7 వాట్స్, 12 వాట్స్ తో వీటిని అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద, ప్రతి ఫ్యామిలీకి గరిష్టంగా 5 బల్బులను ఇస్తోంది. ఈ బల్బుల ద్వారా వార్షికంగా రూ.250 కోట్లను ప్రభుత్వం ఆదా చేస్తుంది. అంతేకాక 71 కోట్లకు పైగా యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేస్తుంది. మార్చి 31, 2022 వరకు ఈ ప్రోగ్రామ్ నడవనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa