చిత్తూరు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో కొత్తగా పెళ్లయిన దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు దంపతులను తిరుపతికి తరలించారు. మదనపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి ఆస్పత్రి అవుట్ పోస్ట్ పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పుంగనూరు మండలం, చింపిరిపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గంగరాజు(26) వాల్మీకిపురం పట్టణం, గాంధీ పేట కు చెందిన జోష్న (22)ను కొత్తగా వివాహం చేసుకున్నాడు. తిరిగింపుల్లో భాగంగా గంగరాజు వాల్మీకిపురం లోని అత్తగారింటికి భార్య జ్యోష్న ను రెండు రోజుల క్రితం తోడుకుని వెళ్లి తిరిగి పుట్టినింటికి భార్యనుతన బైకులో తీసుకుని వెళుతుండగా, మార్గమధ్యంలోని మదనపల్లి పట్టణం, బసినికొండ బైపాస్ రోడ్డులోని, నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్ లో ఎదురుగా వచ్చిన ఓ కారు నూతన దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడివున్న క్షతగాత్రులను స్థానికులు గుర్తించి 108 ద్వారా స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు వారికి ప్రథమ చికిత్సలు అందించి భార్య భర్తల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెపర్ చేశారు. కుటుంబ సభ్యులు వారిని వెంటనే తిరుపతికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన రూరల్ ఎస్ఐ డి సోమశేఖర్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa