పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తగరపువలస సమీపంలోని సంగివలసకాలనీలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీపతిరాజు, రమాదేవి దంపతుల కుమార్తె గౌతమి(18) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పదో తరగతిచదివిన గౌతమి మూడేళ్లుగా ఇంట్లోనే ఉంటుందన్నారు. తండ్రి ఓ పరిశ్రమలో డ్రైవరుగా, తల్లి తగరపువలసజీడిపప్పు దుకాణంలో పని చేస్తోంది. రమాదేవి ఎప్పటిలాగే పనికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలోభోజనం కోసం ఇంటికి వచ్చేసరికి కుమార్తె ఉరేసుకుని ఉండడంతో వెంటనే భర్తకు సమాచారం ఇచ్చింది. ఇటీవలఈమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం దానిని ఆమె వ్యతిరేకించడంతో మనస్తాపం చెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa