ఓ మహిళ తనకు వరుసకు మరిది అయ్యే వ్యక్తితో ఎఫైర్ కొనసాగించింది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. దీంతో ఆ మహిళ తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.ఏలూరు కొత్తపేటకు చెందిన ఓ వివాహిత, రాజమండ్రికి చెందిన హేమూ ఇద్దరూ వరుసకు వదిన, మరిది అవుతారు. ఇటీవల వారికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారిద్దరి వ్యవహారం హద్దులు దాటింది. ఆ మహిళ తన పిల్లలు, భర్తను అస్సలు దగ్గరకు రానిచ్చేది కాదు. దీంతో భర్తకు ఆమెపై అనుమానం వచ్చింది. ఆమెపై నిఘా పెట్టి అసలు విషయం తెలుసుకున్నాడు. దీంతో వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ విషయాన్ని ఆ మహిళ తన ప్రియుడు హేము కి చెప్పింది.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి హేము రాజమండ్రి నుంచి ఏలూరు వచ్చాడు. ఆ వివాహిత తన ఇంట్లో ఒక లెటర్ రాసి బయటకు వెళ్లింది. ఇద్దరు కలిసి బుధవారం ఉదయం ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మహిళ, హేము వ్యవహారం ఇంట్లో తెలిసిందన్న భయంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హేము అత్మహత్యకు ప్రేరేపించడం వల్లే ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa