బీహార్లోని జమూయి జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లైన 6 నెలలకే వికాస్ కుమార్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని భార్య కాజల్ కుమారి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల వికాస్ తన భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు యువకులు వికాస్ భార్యను కలవడానికి వచ్చారు. వారు ముగ్గురూ బాగా చనువుగా ఉంటూ ఉండటం వికాస్కు నచ్చలేదు. ఆ వచ్చిన ఇద్దరిలో కాజల్ ప్రియుడు ఉన్నాడు. తన భర్తను చంపించే ఉద్దేశంతో అతను ఎవరో ప్రియుడికి చూపించేందుకు కాజల్ తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఆ మరుసటి రోజు బయటకు వెళ్లిన వికాస్ మళ్లీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారు. ఎక్కడా అతని ఆచూకీ దొరకలేదు. ఉదయం ఊరి పొలాల్లో వికాస్ మృతదేహం కనిపించింది. ఎవరో అతని గొంతు కోసి చంపేశారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వికాస్ భార్య కాజల్ కుమారి కూడా వికాస్ మృతదేహాన్ని చూసేందుకు అక్కడికి వెళ్లింది. ఆమెపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని చావుకు ఈమెనే కారణమని గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగుచూసింది. తన ప్రియునితో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు భర్త అడ్డుగా ఉండటంతో అతడిని చంపినట్లు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది. పోలీసులు ఆమెపై, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa