ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంద్రా లో ఆ జిల్లా లో కొనసాగుతున్న ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 04:55 PM

ఆంద్రా లోని పలు  జిల్లాల లో ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన కొనసాగుతుంది.  ఏ క్షణంలోనైనా సమ్మెకు సిద్ధమని ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు ప్రకటించారు. ఏపీలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వారి నిరసనలు కొనసాగుతున్నాయి. ‘‘రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నాం. తిరుపతిలో ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సెంట్రల్ బస్టాండ్ వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్నారు. వారికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తొలగించిందన్నారు. ప్రభుత్వం విలీనం అయిందని సంతోషించాలో, ఉన్న సౌకర్యాలు కోల్పోయామని బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలోని 15 డిపోల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa