ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలకు కళ్ళు లేక విమర్శలు చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 12:05 PM

విజయవాడ వన్‌ టౌన్‌లోని 51వ డివిజన్‌లో గడిచిన పది మాసాల కాలంలో సుమారు రెండు కోట్లతో పలు అభివృద్ధి నిర్మాణాలు చేపట్టామని స్థానిక కార్పొరేటర్‌ మరుపిళ్ల రాజేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఈ మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేష్‌ మాట్లాడారు. టీడీపీ నాయకులు కళ్లు ఉండి కాబోదులుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై లేనిపోని విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాలతో డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో డివిజన్‌లో 815 పెన్షన్లు ఉండగా నేడు అవి 1241కు పెరిగాయన్నారు. అలాగే డివిజన్‌లో ఇల్లు లేని పేదలకు 2200 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామన్నారు. కొండల పైన ఉన్న ఇళ్లకు 700పైగా జగన్‌ అన్న శాశ్వత పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. సుమారు ఐదు లక్షల వ్యయంతో పితాని అప్పలస్వామి వీధిలో కొండపైన మెట్లు డ్రైన్లు పనులు చేపట్టామన్నారు. సుమారు రూ. 30 లక్షలతో పోతిన వారివీధి నుంచి వడ్డె వారి వీధి వరకు శిథిలావస్థలో మెట్లు, డ్రైన్ల నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే పడాల వారి వీధి కొండపైన రూ.13 లక్షలతో, కొండపైన పుట్ట వద్ద రూ.8.5 లక్షలతో రిటైనింగ్‌వాల్స్‌ నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. అలాగే ఆంజనేయవాగులో మరో రూ.20 లక్షలతో పనులకు టెండర్లు పిలుస్తున్నారన్నారు. అలాగే డివిజన్‌లోని వాటర్‌ ట్యాంక్‌ మరమ్మతులకు పది లక్షలతో టెండర్లను పిలిచారన్నారు. ఇవి గాక వివిధ డివిజన్లకు సంబంధించిన కేటీరోడ్డు నిర్మాణానికి మూడున్నర కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే టీడీపీ నాయకులకు కనపడటం లేదన్నారు. చంద్రబాబు పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. స్థానిక నాయకులు మంత్రి మీద, ప్రభుత్వంపైన విమర్శలు చేయటం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి అభివృద్ధి పనులను చూడాలని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa