కృష్ణా జిల్లా: గుడివాడ క్యాసినో వ్యవహారం ఢిల్లీకి చేరింది. గుడివాడలో అక్రమంగా క్యాసినో నిర్వహించి కోట్ల రూపాయల అక్రమ బెట్టింగ్ లు జరిగాయంటూ టీడీపీ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈడీ డైరెక్టర్ ను కలిసి ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సమయంలో కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన ఫంక్షన్ హాల్లో అక్రమంగా క్యాసినో నిర్వహించారని తెలిపారు. క్యాసినో వ్యవహారం పై టీడీపీ నిజనిర్ధారణ కమిటి సాక్ష్యాలు సేకరించి ఓ నివేదికను సిద్ధం చేసిందని, దాన్ని నేడు ఈడీకి అందించినట్లు ఆయన తెలిపారు. 500 కోట్ల రూపాయల బెట్టింగ్, డ్రగ్స్, లిక్కర్, నిషేధిత వస్తువులతో క్యాసినో నిర్వహించినట్టు ఈడీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ క్యాసినో నిర్వహణపై చర్యలు తీసుకోవాలని ఈడీని కోరామని తెలిపారు. స్వయంగా ఒక మంత్రి తనకు చెందిన ల్యాండ్ లో క్యాసినో నిర్వహించారని. నిజనిర్ధారణ కొరకు వెళ్లిన టీడీపీ, బీజేపీ నేతలను వైసీపీ గుండాలు, పోలీసులు అడ్డుకున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు. చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర పోలీసులు సైతం వైసీపీ కండువా వేసుకొని. అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. క్యాసినో వ్యవహారంపై ఈడీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa