ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనవరాలి పెళ్లి కి తిరుమల చేరుకున్న వెంకయ్యనాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 05:50 PM

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన మనవరాలి వివాహానికి తిరుమలకు చేరుకున్నారు. తిరుచానూరు యోగిమల్లవరంలోని ఓ ప్రైవేట్ కల్యాణమండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. వెంకయ్య నాయుడు కుటుంబీకులు... నలుగు ఇంకా ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఈ  కల్యాణ మండపంలో జరగనుండగా, మిగిలిన పెళ్లి వేడుకలు ఈరోజు రాత్రి నుంచి తిరుమలలో జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం తిరుచానూరు కల్యాణ మండపం నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు తిరుమలలోని కల్యాణ మండపానికి వెళ్లనున్నారు. ఈ మేరకు తిరుచానూరు కల్యాణ మండపం వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa