ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో చిరుద్యోగి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 09:23 AM

తనను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారన్న మనస్తాపంతో ఓ చిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తన ఫేస్ బుక్క్ ఖాతాలో వీడియో పోస్ట్ చేసిన కాసేపటికి గడ్డి మందు తాగి మృతి చెందిన ఘటన ఇది. స్థానికులు తెలిపిన మేరకు. గుంటూరుకు చెందినభాస్కర్ రావు (35) మండలంలోని పేరేచర్ల లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆయన గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తూ ఉంటారు. బుధవారం గడ్డి మందు తాగారు. గమనించిన స్థానికులు 108 వాహనంలో చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతి చెందారు. అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, బంధువులు భాస్కరరావు కు చెందిన చరవాణి, ఫేస్ బుక్ ఖాతా పరిశీలించగా వీడియో పోస్ట్ కనిపించింది. ఆయన గడ్డి ముందు తాగాక ముందు వీడియో తీసి ఖాతాలో ఉంచినట్టు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa