ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ లేదా 12వ తరగతిలో మ్యాథ్స్ను తప్పనిసరిగా చదివుండాలనే నిబంధనను అఖిల భార త సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సరళత రం చేసింది. ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి న మొత్తం 29 డిప్లొమా/యూజీ కోర్సుల్లో 10 కోర్సులను మ్యాథ్స్ అర్హత నుంచి మినహాయించిం ది. ఈ మేరకు 2022-23 విద్యాసంవత్సరానికి నూ తన మార్గదర్శకాలను ప్రకటించింది. వీటిని అనుసరించి.. డిగ్రీలో ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, ఫ్యాష న్ టెక్నాలజీ వంటి కోర్సులు చేయడానికి మ్యాథ్స్ తప్పనిసరి కాదు. అలాగే పలు కోర్సులకు కెమిస్ట్రీని మినహాయించింది.
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్ కోర్సులు చే యాలంటే ఇంటర్లో కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివుండాల్సిన అవసరం లేదు. అంతేగాక మరిన్ని సబ్జెక్టులను ఇంజనీరింగ్ అర్హతల పరిధిలోకి ఏఐసీటీఈ తీసుకొచ్చింది. ఇంటర్ స్థాయిలో బయాలజీ, బయోటెక్నాలజీ, బిజినెస్ స్టడీస్, అగ్రికల్చర్, టెక్నిక ల్ ఒకేషనల్ సబ్జెక్టు, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, ఎలకా్ట్రనిక్స్ తదితర సబ్జెక్టులు చదివినవారు కూడా ఇంజనీరింగ్ చేయవచ్చు. నూతన విద్యావిధానంలో పేర్కొన్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఏఐసీటీఈ తాజా నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa