చిన్న దేశమైన ఉక్రెయిన్పై ఎన్ని భీకర దాడులు చేసినా ఆ దేశం రష్యాకు లొంగలేదు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అసహనంతో రగిలిపోతున్నారు. ఉక్రెయిన్ను హస్తగతం చేసుకోవాలనే పట్టుదలతో ఆదివారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్పై దాడులు నిర్వహించే బాధ్యతను సైనిక జనరల్ అలెగ్జాండర్ దివొర్నికోవ్కు అప్పగించారు. ఆయన యుద్ధ రంగంలో అత్యంత క్రూరంగా వ్యవహరిస్తాడనే అభియోగాలు ఉన్నాయి. గతంలో సిరియాతో పాటు వివిధ యుద్ధాల్లో దివొర్నికోవ్ అకృత్యాలను అమెరికా ప్రస్తావిస్తోంది. యుద్ధ రంగంలో సామాన్యులను కూడా దివొర్నికోవ్ ఊచకోత కోసిన విషయాన్ని గుర్తు చేస్తోంది. అటువంటి వైఖరి కారణంగా ఆయనకు రష్యా ప్రభుత్వం 'హీరో ఆఫ్ రష్యా' పురస్కారాన్ని కూడా అందజేసింది. ఇప్పటికే ఉక్రెయిన్లో రష్యా యుద్ధ నియమాల ఉల్లంఘనపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పిల్లలను, సామాన్య పౌరులను చంపడం, మహిళలపై అత్యాచారాలు చేయడం వంటి చర్యలతో రష్యా సేనల దురాగతాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ప్రస్తుతం దివొర్నికోవ్ను కీలక పదవిలో నియమించడంతో అకృత్యాలు మరింత పెరుగుతాయనే ఆందోళన నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa