ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2019, 10:18 PM

సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, ఓపెనింగ్స్ మాత్రం గొప్పగా రాలేదు. కానీ, సినిమా అయితే హిట్ అనే టాక్ మాత్రం జనాల్లోకి వెళ్లిపోయింది. అందుకే, ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకున్నాయి. మూడో రోజైన ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్లన్నీ ఇంచుమించుగా హౌస్‌ఫుల్ అయిపోయాయి. దీంతో తొలిరోజు కన్నా మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అంటున్నారు విశ్లేషకులు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ చిత్రం సుమారు రూ.5.6 కోట్ల షేర్‌ను వసూలు చేసిందని సమాచారం. గ్రాస్ రూ.15 కోట్ల వరకు ఉందని అంటున్నారు. మూడో రోజు కలెక్షన్లు బాగా పుంజుకున్నాయి కాబట్టి.. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల వరకు షేర్ రాబట్టడం ఖాయమని చెబుతున్నారు. తొలి రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల వారీగా షేర్ వివరాలు ఇలా ఉన్నాయి (అంచనా)..
నైజాం - రూ. 2.45 కోట్లు, సీడెడ్ - రూ. 66 లక్షలు, నెల్లూరు - రూ. 24 లక్షలు, కృష్ణ - రూ. 37 లక్షలు, గుంటూరు - రూ. 45 లక్షలు, వైజాగ్ - రూ. 62 లక్షలు, తూర్పుగోదావరి - రూ. 47 లక్షలు, పశ్చిమ గోదావరి - రూ. 34 లక్షలు, మొత్తం ఏపీ, టీఎస్ షేర్ - రూ. 5.60 కోట్లు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa