ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రొమాన్స్ వద్దు..కామెడీ ముద్దు

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 07:42 PM

కాక్ టైల్   చిత్ర ఆడియో ఆవిష్కరణ  కార్యక్రమం  ఇటీవల చెన్నైలోని  ఒక కాలేజ్ లో  జరిగింది. ఈ  కార్యక్రమంలో  పాల్గొన్న నటి   నమిత  మాట్లాడుతూ  రొమాన్స్‌  చిత్రాలు చూసి చూసి బోర్‌  కొట్టేసిందని  తెలిపింది. కాక్‌టైల్‌ లాంటి కామెడీ  చిత్రాలను చూడడమే ఇష్టమని చెప్పింది. ఈ చిత్రాన్ని తాను థియేటర్‌కు వెళ్లి చూస్తానని తెలిపింది. ప్రముఖ  ఛాయాగ్రాహకుడు  పీజీ.ముత్తయ్య, ఎం.దీప  కలిసి  పీజీ.మీడియా  వర్క్స్‌ పతాకంపై  నిర్మించిన  చిత్రం  కాక్‌టైల్‌. నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన  ఈ చిత్రంలో  ఆయనకు మిత్రులుగా రమేష్, మిథున్, విజయ్‌ టీవీ కలక్కుపోవదు యారు ఫేమ్‌  బాలా, ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. వీరితో పాటు షియాజీ షిండే, మనోబాలా, మైమ్‌గోపి నటించారు. నవ దర్శకుడు ఆర్‌. విజయ్‌మురుగన్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆర్‌జే.రవిన్‌ ఛాయాగ్రహణం, ఎస్‌.సాయిభాస్కర్‌ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రంలో ఆస్ట్రేలియాకు చెందిన  కాక్‌టైల్‌  అనే పక్షి ప్రధాన పాత్రలో నటించిందని, అలా ఒక పక్షి ప్రధాన పాత్రలో నటించడం ఇదే ప్రప్రథం అని నిర్మాతలు  తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa