రాహూ సినిమా హీరోయిన్ కృతి గార్గ్ అదృశ్యమైంది. ఓ అజ్ఞాత వ్యక్తి ట్రాప్ లో పడి హీరోయిన్ మిస్ అయినట్టుగా తెలుస్తోంది. కృతి మిస్సింగ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రాహు సినిమా దర్శకుడు సుబ్బు వేదుల ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి సుబ్బు వేదుల వివరాలు తెలిపాడు. ఆయన ఏమన్నారంటే.. "కృతి గార్గ్ రాహు సినిమాలో నటించింది. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి పేరుతో కృతి గార్గ్ కు కాల్ వచ్చింది. రాహులో మీ నటన అద్బుతమని, ప్రభాస్ పక్కన నటించే అవకాశం కల్పిస్తామని అజ్ఞాత వ్యక్తి కృతికను నమ్మించాడు. కథ వినేందుకు ముంబై రావాలని కోరాడు. అనుమానం వచ్చిన కృతి తనకు కాల్ చేసింది. నా నంబర్ ఇవ్వడంతో అతను నాతో కూడా మాట్లాడాడు. దాదాపు 2 గంటల పాటు మాట్లాడాడు. నాకు కూడా అనుమానం కలిగింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో విన్నాను. అతను కాదని నిర్దారించుకున్నాను. కృతికి కూడా జాగ్రత్త..వెళ్లొద్దని చెప్పాను. కానీ ముంబైలో ఉండే కృతి గార్గ్ అతనిని కలిసేందుకు ఆదివారం ఉదయం వెళ్లింది. సోమవారం ఉదయం నుంచి కృతి ఫోన్ కలవట్లేదు. దీంతో కంగారుపడి పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేశాను. అజ్ఞాత వ్యక్తి నంబర్ అనంతపురానికి చెందిన నరేష్ దిగా పోలీసులు గుర్తించారు. ముంబై పోలీసులతో కలిసి తెలంగాణ పోలీసులు హీరోయిన్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మహిళల సాధికారత కోసం తాను సినిమా తీశానని, తన సినిమాలో నటించిన అమ్మాయికే ఇలా కావడం బాధాకరమని" ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa