'మిడ్ నైట్ రన్నర్స్' కొరియన్ మూవీ. తెలుగులో రిమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. అయితే ఈ సినిమాతో యంగ్ హీరోయిన్స్ రెజీనా, నివేదా థామస్ మిడ్ నైట్ రైన్స్ గా మారబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని రిమేక్ చేయనుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. రెజీనా, నివేదా ప్రధాన పాత్రల్లో ఈ రిమేక్ రాబోతుంది. కొరియన్ సినిమాకి పని చేసిన స్టంట్ మాస్టర్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. వాళ్ల దగ్గరే రెజీనా - నివేదా శిక్షణ తీసుకున్నారు. ఈ నెల మూడవ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ ఇద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa