నా తమ్ముడు కోటీశ్వరుడు.. మా అమ్మ మాకు భారీగానే ఆస్తులు ఇచ్చింది.. వాడికి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు.. డబ్బుల్లేక చనిపోవాల్సిన ఖర్మ మా తమ్ముడికి పట్టలేదు.. ఇది తాజాగా ఉదయ్ కిరణ్ మరణంపై ఆయన అక్క శ్రదేవి చేసిన సంచలన వ్యాఖ్యలు. మస్కట్లో ఉండే ఈమె చాలా రోజలు తర్వాత మళ్లీ ఉదయ్ మరణంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి ఉదయ్ కిరణ్ భార్యపై ఆమె అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా తన తమ్ముడు ఎప్పుడూ కోటీశ్వరుడే.. వాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని కొట్టి పారేసింది శ్రీదేవి.వాళ్ల అమ్మ చనిపోతూ తనకు, తన తమ్ముడికి 4 కేజీల బంగారంతో పాటు 100 కేజీల వెండి.. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మూడు ఆస్తులు కూడా ఇచ్చినట్లు చెప్పింది. అవన్నీ కూడా ఉదయ్ పేరు మీదే ఉన్నాయని.. అలాంటప్పుడు తన తమ్ముడు డబ్బులేని వాడు ఎలా అవుతాడని ఆమె ప్రశ్నిస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఉదయ్ కిరణ్ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పింది ఈమె. ఉదయ్ కిరణ్ మరణంపై అనుమానాలున్నాయంటూ చాలా కాలంగా ఈమె చెబుతూనే ఉంది. కానీ ఆత్మహత్య అంటూ దాన్ని ఎవరూ ముందుకు తీసుకురాలేదు.ఉదయ్ చనిపోయిన తర్వాత తన ఆస్తులు కూడా మొత్తం అతడి భార్య విషిత తీసుకుందని.. కనీసం తమ కుటుంబంతో కలిసే ప్రయత్నం కానీ.. దగ్గరయ్యే ప్రయత్నం కానీ చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీదేవి. అంతేకాదు ఉదయ్ ఆస్తులు అన్నీ ఆమే తీసుకుందని చెప్పింది. బంగారం.. వెండితో పాటు ప్రాపర్టీస్ కూడా తీసుకుని కనీసం మాట్లాడటానికి కూడా ప్రయత్నించలేదని చెప్పింది శ్రీదేవి. ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా కూడా ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకుంటుందని.. తమను దూరం పెడుతుందని శ్రీదేవి చెబుతుంది.విషిత ప్రవర్తనతో తమకు మాకు అనుమానాలు వస్తున్నాయని.. ఉదయ్ మరణం విషయంలో కూడా తమకు చాలా అనుమానాలు ఉన్నాయంటూ చెబుతుంది ఈమె. ఉదయ్ కిరణ్ చనిపోయిన ఆరేళ్ల తర్వాత శ్రీదేవి చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి పుట్టిస్తున్నాయి. నిజంగానే ఉదయ్ మరణంలో భార్య పాత్ర కూడా ఉందా అనే కోణం కూడా ఇప్పుడు అందర్లోనూ వస్తుంది. మొత్తానికి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa