ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్షయ్ కుమార్ మరోసారి భారీ విరాళం

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 10, 2020, 02:44 PM

కరోనా పై పోరాటంలో ఒక్కోక్కరుగా తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్.. ప్రధాన మంత్రి సహాయనిధికి ఇప్పటి వరకు మన దేశంలోనే ఏ హీరో ఇవ్వలేనంతగా ఏకంగా రూ. 25 కోట్ల భారీ విరాళం ప్రకటించి మన పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వైరస్ మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈయన ప్రశంసించడమే కాకుండా.. 25 కోట్ల రూపాయలను తన వంతుగా ప్రభుత్వానికి ఇస్తున్నట్లు ప్రకటించాడు అక్షయ్ కుమార్. ఈయన సాయం చూసి అంతా నువ్వు రియల్ హీరో అంటూ పొగిడేస్తున్నారు. అక్షయ్ కుమార్ కూడా తాను ముంబైలో కేవలం రూ. 200 లతో అడుగుపెట్టాను. ఆకలితో ఎన్నో సార్లు పస్తులు కూడా ఉన్నాను.  అలాంటి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ప్రజలు. అలాంటి ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోవడం నా ధర్మం అంటూ తన వినమ్రతను చాటుకున్నారు.కేవలం ప్రజలు ఇచ్చిన డబ్బునే వాళ్లు కష్టాల్లో ఉన్నపుడు తిరిగిచ్చేసానంటూ చెప్పుకొచ్చారు.తాజాగా అక్షయ్ మరోసారి భారీ విరాళం ప్రకటించాడు.ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ. 3 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ విరాళంలో మున్సిపల్ కార్మికులకు అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసం ఈ విరాళం అందజేయనున్నట్టు అక్షయ్ కుమార్ ప్రకటించారు. ఈ విరాళంతో కలిపి అక్షయ్ కుమార్.. మొత్తంగా రూ. 28 కోట్ల విరాళాన్నిఇవ్వడం నిజంగా గ్రేట్. అంతేకాదు అభినవ దాన కర్ణుడు అనిపించుకుంటున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa